PM Modi : ప్రధాని మోదీని కలిసిన మహిళా బాక్సర్లు

PM Modi : అంతర్జాతీయ మహిళ బాక్సింగ్ పోటీల్లో ఛాంపీయన్గా నిలిచిన నిఖత్ జరీన్...ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. ఆమెతో పాటు టోర్నీలో మెడల్స్ గెలిచిన బాక్సర్లు మనీషా మౌన్, పర్వీన్ హుడా సైతం మోదీని కలిశారు. ప్రధాని మోదీని కలిసిన తర్వాత ట్వీట్ చేశారు నిఖత్ జరీన్. ప్రధానిని కలవడం తనకు ఎంతో గౌరవంగా ఉందని ట్వీట్ లో పేర్కొన్నారు.
గత నెలలో టర్కీలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోరులో థాయ్లాండ్ ప్లేయర్ను చిత్తు చేసిన నిఖత్..గోల్డ్ మెడల్ గెలిచిన ఐదో భారత బాక్సర్గా రికార్డులకెక్కింది. చివరగా 2018లో మేరి కోమ్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించింది. నిఖత్ కంటే ముందు మేరి కోమ్, సరితా దేవి, జెన్ని RL, లేఖ కేసీ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించారు.
Prime Minister Narendra Modi meets the women boxers Nikhat Zareen, Manisha Moun and Parveen Hooda who won medals in the World Boxing Championships pic.twitter.com/4CHqr6FM1d
— ANI (@ANI) June 1, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com