Heeraben Modi: ఆస్పత్రిలో చేరిన ప్రధాని మోదీ తల్లి..

Heeraben Modi: ఆస్పత్రిలో చేరిన ప్రధాని మోదీ తల్లి..
Heeraben Modi: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో మరియు చివరి దశకు ముందు ఈ నెల ప్రారంభంలో ప్రధాని మోదీ తన తల్లిని కలిశారు.

Heeraben Modi: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో మరియు చివరి దశకు ముందు ఈ నెల ప్రారంభంలో ప్రధాని మోదీ తన తల్లిని కలిశారు. ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ (99) బుధవారం ఆసుపత్రిలో చేరినట్లు జాతీయ మీడియా నివేదించింది. ఆమె ఈరోజు స్వల్ప అస్వస్థతకు గురికావడంతో అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌‌కి తరలించారు.



హీరాబెన్‌కు చికిత్స అందిస్తున్న వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండవ మరియు చివరి దశకు ముందు ప్రధాని ఈ నెల ప్రారంభంలో తన తల్లిని కలిశారు. హీరాబెన్ కూడా ఓటు వేశారు.


జూన్ 18, 1923న జన్మించిన హీరాబెన్ ఇటీవలే 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. తల్లి పుట్టినరోజు సందర్భంగా ఆమెను కలిసిన తర్వాత ప్రధాని మోదీ ట్విట్టర్‌లో.. "నా జీవితంలో, నా పాత్రలో మంచి ప్రతిదీ నా తల్లిదండ్రులకు ఆపాదించబడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజు నేను ఢిల్లీలో ఉన్నాను. కానీ నా హృదయమంతా గత జ్ఞాపకాలతో నిండిపోయింది" అని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story