మరో రెండు ప్రాజెక్టులకు భూమి పూజ చేసిన మోదీ!

మరో రెండు ప్రాజెక్టులకు భూమి పూజ చేసిన మోదీ!
దేశవ్యాప్తంగా 27 నగరాల్లో 1000 కిలోమీటర్లకు పైగా మెట్రో నెట్‌వర్క్ పనులు జరుగుతున్నాయని మోదీ చెప్పారు.

గుజరాత్‌లో మరో రెండు మెట్రో ప్రాజెక్టులకు దేశ ప్రధాని మోదీ భూమి పూజ చేశారు. రూ.5,384 కోట్లతో 28.25కి.మీ నిర్మించే అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-2, రూ.12,020 కోట్లతో 40.35 కి.మీ మేర నిర్మించే సూరత్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమి పూజ చేశారు. ఈ మెట్రో ప్రాజెక్టుల ద్వారా ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ట్రాఫిక్ నుంచి ఉపశమనం లభిస్తుందని మోదీ అన్నారు.

అహ్మదాబాద్‌లో నిర్మిస్తున్న మెట్రో రైలు రెండో ఫేజ్‌ పనులు అహ్మదాబాద్‌కు గొప్ప బహుమతి అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 27 నగరాల్లో 1000 కిలోమీటర్లకు పైగా మెట్రో నెట్‌వర్క్ పనులు జరుగుతున్నాయని మోదీ చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటుగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్రాత్, ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి తదితరులు పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story