PM Modi : స్కాట్లాండ్ గ్లాస్గోకు చేరుకున్న ప్రధాని మోదీ..!
By - /TV5 Digital Team |1 Nov 2021 2:05 PM GMT
PM Modi : కాప్-26 వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు.... స్కాట్లాండ్ లోని గ్లాస్గో చేరుకున్నారు ప్రధాని మోదీ.
PM Modi : కాప్-26 వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు....స్కాట్లాండ్ లోని గ్లాస్గో చేరుకున్నారు ప్రధాని మోదీ. వాతావరణ మార్పుల విషయంలో భారత్ ఎజెండాను గ్లాస్గొ సదస్సు వేదికగా ప్రకటించనున్నారు . ఈ సెక్టార్ లో సాధించిన విజయాలను వివరించనున్నారు ప్రధాని. రెండు రోజుల పాటు గ్లాస్గోలోనే ఉండనున్నారు . బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో తమ భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అంతకుముందు స్కాట్లాండ్ కు చేరుకున్న ప్రధాని మోదీకి ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రవాసులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు మోదీ.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com