పోస్టాఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్

పోస్టాఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్
నిర్ధేశించిన ఉచిత ట్రాన్సాక్షన్ లిమిట్ దాటిన తర్వాత చార్జీల బాదుడు మొదలవుతుంది.

పోస్టాఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్ ఉన్న వారికి బ్యాడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. దీంతో పోస్టాఫీస్ కస్టమర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. ఇకపై అకౌంట్లో డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా చార్జీలు చెల్లించుకోవాల్సి రావొచ్చు.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ IPPB కస్టమర్లు అదనపు చార్జీలు చెల్లించుకోవాలి. ఇంకా ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా జరిపే లావాదేవీలపై కూడా చార్జీలు ఉంటాయి. నిర్ధేశించిన ఉచిత ట్రాన్సాక్షన్ లిమిట్ దాటిన తర్వాత చార్జీల బాదుడు మొదలవుతుంది.

బేసిక్ సేవింగ్స్ అకౌంట్ కలిగిన వారు నెలకు 4 సార్లు ఉచితంగా ఎలాంటి చార్జీలు లేకుండా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. తర్వాత లావాదేవీ విలువలో 0.5 శాతం లేదా గరిష్టంగా రూ.25 వరకు చార్జీ పడుతుంది. క్యాష్ డిపాజిట్ చార్జీలు ఉండవు. బేసిక్ అకౌంట్ కాకుండా ఇతర అకౌంట్ ఉన్న వారిపై చార్జీలు ఉంటాయి.

సేవింగ్స్ ఖాతా కలిగిన వారు వారి అకౌంట్ నుంచి నెలకు రూ.25 వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. తర్వాత ప్రతి లావాదేవీకి చార్జీలు పడతాయి. రూ.25 లేదా లావాదేవీ విలువలో 0.5 శాతం చార్జీ చెల్లించుకోవాలి. అలాగే నెలలో రూ.10,000 వరకు క్యాష్ డిపాజిట్‌పై చార్జీలు ఉండవు. ఇంకా దీనికి మించి డిపాజిట్ చేస్తే మాత్రం ప్రతి సారి 0.5 శాతం వరకు చార్జీలు చెల్లించుకోవాలి.

ఏఈపీఎస్ లావాదేవీలపై కూడా చార్జీలు ఉన్నాయి. ఐపీపీబీ నెట్‌వర్క్‌లో అయితే ఎలాంటి చార్జీలు ఉండవు. ఎన్నిసార్లైనా ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్లు నిర్వహించొచ్చు. అయితే నాన్ ఐపీపీబీ నెట్‌వర్క్‌లో అయితే నెలకు 3 లావాదేవీలు ఉచితం. ఈ లిమిట్ దాటితే రూ.20 చార్జీలు చెల్లించుకోవాలి.

Tags

Read MoreRead Less
Next Story