ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన రాష్ట్రపతి

X
By - Nagesh Swarna |31 Aug 2020 6:43 PM IST
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి కావడం పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి కావడం పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రణబ్ ముఖర్జీ కన్నుమూయడంతో ఓ శకం ముగిసిందని పేర్కొన్నారు. ప్రజా జీవితంలో మహోన్నత నేత అని, ఆయన భరత మాతకు ఓ రుషి మాదిరిగా సేవ చేశారని కొనియాడారు. అత్యంత విలువైన బిడ్డల్లో ఒకరిని కోల్పోయినందుకు దేశం శోకిస్తోందని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ప్రజలందరికీ సంతాపం తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com