బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్.. అమర జవాన్లకు ప్రధాని మోదీ, అమిత్ షా నివాళులు.. !
ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో శనివారం జరిగిన భీకర ఎన్కౌంటర్ లో ఇప్పటివరకు 14 మంది జవాన్లు మృతిచెందినట్లు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం గాలింపు ముమ్మరం చేశామని అధికారులు తెలిపారు. గల్లంతైన జవాన్లలో ఏడుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు ఉన్నట్లు సమాచారం. నక్సల్స్ కాల్పుల్లో గాయపడిన జవాన్లను బీజాపూర్, రాయ్ పూర్ ఆస్పత్రికి తరలించారు.
సుక్మా, బీజాపూర్ సరిహద్దు వెంబడి ఉన్న అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది.. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ లో సుమారు 2వేల మంది జవాన్లు పాల్గొన్నారు. బృందాలుగా విడిపోయి మావోయిస్టుల కోసం జల్లెడ పడుతుండగా.. నక్సల్స్ మెరుపుదాడికి దిగారు. కాగా ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమర జవాన్లకు నివాళులర్పించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com