Pruthi Shaw Attack: కౌంటర్ కేస్ ఫైల్ చేసిన స్వప్నా గిల్
By - Chitralekha |21 Feb 2023 7:53 AM GMT
స్వప్నా గిల్ కు బెయిల్ మంజూరు; పృధ్వి షాపై కౌంటర్ కేస్; అతడి దరుసు ప్రవర్తన వల్లే....
క్రికెటర్ పృధ్వీ షాపై దాడి కేసులో అరెస్ట్ అయిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ స్వప్న గిల్ కు బెయిలు మంజూరు అయింది. అయితే ఆమె బయటకు రాగానే పృధ్వీపై కౌంటర్ కేస్ ఫైల్ చేయడం విశేషం. తన కంప్లైంట్ లో జరిగిన ఉదంతాన్ని సాంతం వివరంచింది. ఫిబ్రవరి 15న స్వప్న తన స్నేహితురాళ్లతో కలసి రెస్టారెంట్ కు వెళ్లగా, అక్కడ పృధ్విని చూసినట్లు కంప్లైట్ లో పేర్కొంది. తమ స్నేహితుల్లో శోభిత్ ఠాకుర్ అనే ఒకరు అప్పటికే పూటుగా తాగేసి ఉన్న పృధ్వీని సెల్ఫీ కోసం అడిగారని, అయితే క్రికెటర్ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాడని, తన ఫ్రెండ్ దగ్గర ఫోన్ తీసుకుని విసిరేశాడని పేర్కొంది. పృధ్వి తన స్నేహితులతో కలసి శోభిత్ మీద దాడి చేశాడని తెలిపింది. ఈ క్రమంలో శోభిత్ ను కాపాడేందుకు తాను వెళ్లగా, పృధ్వి తనను అనుచితంగా తాకాడని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసు కంప్లైంట్ చేస్తానని బెదిరించగా, పృధ్వి వద్దని ప్రాధేయపడ్డాడని వివరించింది. అందుకే తాను ఆరోజు కేసు ఫైల్ చేయలేదని తెలిపింది. ఇక తాను రూ.50వేలు డిమాండ్ చేయడం పైనా స్వప్న క్లారిటీ ఇచ్చింది. మరీ చీప్ గా రూ.50 డిమాండ్ చేయడం ఏమిటని, తాను రెండు రీల్స్ చేస్తే చాలు ఆ మాత్రం సంపాదించగలనని స్పష్టం చేసింది. పృధ్వీ నమోదు చేసిన కేసు ఎంత బలహీనమైందో అర్ధమవ్వడానికి ఇదే ఉదాహరణ అని వెల్లడించింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com