పుదుచ్చేరి సంక్షోభం: గవర్నర్ తమిళి సై కీలక నిర్ణయం..!
By - TV5 Digital Team |18 Feb 2021 4:11 PM GMT
ఇటీవల నలుగురు MLAల రాజీనామాలతో మైనారిటీలో పడిన నారాయణస్వామి ప్రభుత్వాన్ని ఈనెల 22న సా.5గం.కు అసెంబ్లీలో బలపరీక్షకు ఆదేశించారు.
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే తమిళి సై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల నలుగురు MLAల రాజీనామాలతో మైనారిటీలో పడిన నారాయణస్వామి ప్రభుత్వాన్ని ఈనెల 22న సా.5గం.కు అసెంబ్లీలో బలపరీక్షకు ఆదేశించారు. దీంతో ఆ రోజు నారాయణ స్వామి ప్రభుత్వ భవితవ్యం తేలనుంది. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలుండగా.. కాంగ్రెస్-DMK-స్వతంత్ర అభ్యర్థితో కూడిన కూటమి 18 మంది సభ్యులతో నారాయణస్వామి నేతృత్వంలో గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కాగా, ఇటీవల లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న కిరణ్ బేడిని తొలగించి ఆమె స్థానంలో తమిళిసైకి అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com