Punjab : సైనిక శిబిరంలో దుండగుల కాల్పులు, నలుగురు జవాన్లు మృతి

Punjab : సైనిక శిబిరంలో దుండగుల కాల్పులు, నలుగురు జవాన్లు మృతి
ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. పలువురు జవాన్లకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది

పంజాబ్‌లోని సైనిక శిబిరంలో కాల్పులు కలకలం రేపాయి. బఠిండాలోని మిలిటరీ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. పలువురు జవాన్లకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తం అయిన క్విక్‌ రియాక్షన్ బృందాలు ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకొని గాలింపు చేపట్టాయి. అయితే అప్పటికే నిందితులు అక్కడి నుంచి పరార్ అయ్యారు. ప్రస్తుతం దుండగుల కోసం వేట కొనసాగుతోంది. మిలిటరీ స్టేషన్‌ను మూసివేసి కార్డన్‌ సెర్చ్‌ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story