Punjab: ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు ఉ.7.30 గంటలకే ఆఫీస్లో ఉండాలి
By - Subba Reddy |9 April 2023 3:00 AM GMT
ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది పంజాబ్ సర్కారు
ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది పంజాబ్ సర్కారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులంతా ఉదయం 7.30 గంటలకే ఆఫీస్లో ఉండాలి. మధ్యాహ్నం 2 గంటలకే ఇంటికి వెళ్లిపోవచ్చంటున్నారు సీఎం భగవంత్ మాన్. ఉద్యోగులు, ప్రజాసంఘాలతో చర్చలు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ పనివేళలు మే 2 నుంచి జులై 15 వరకు అమలులో ఉండనున్నాయి. ఉద్యోగం చేసుకునే వారు ప్రభుత్వ కార్యాలయాల్లో పని ఉంటే.. ఉదయమే పూర్తి చేసుకోవచ్చని అన్నారు. సెలవు పెట్టి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేదని చెప్పుకొచ్చారు. వేసవి సీజన్ను దృష్టిలో పెట్టుకొనే భగవంత్ మాన్ సర్కారు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com