బ్రేకింగ్.. కరోనాతో కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి సురేష్ అంగడి మృతి

X
By - Nagesh Swarna |23 Sept 2020 9:54 PM IST
. దేశంలో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన తొలి కేంద్రమంత్రి.
భారత్లో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది.. కరోనా బారిన పడి ప్రజాప్రతినిధులు కన్నుమూయడం విషాదాన్ని కలిగిస్తోంది.. కరోనాతో కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్ అంగడి కన్నుమూశారు. ఢిలీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. సురేష్ అంగడి.... దేశంలో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన తొలి కేంద్రమంత్రి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం తర్వాత ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. సురేష్ అంగడి కర్ణాటకలోని బెళగావి లోక్సభ స్థానం నుంచి విజయం సాధించారు. నాలుగు సార్లు ఆయన ఎంపీగా గెలిచారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com