ఐసీయూలో కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్

X
By - shanmukha |21 Sept 2020 7:42 PM IST
కేంద్ర మంత్రులు వరుసగా ఆనారోగ్యానికి గురవుతున్నారు. కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఢిల్లీలో ఆస్పత్రిలో ఐసీయూలో
కేంద్ర మంత్రులు వరుసగా ఆనారోగ్యానికి గురవుతున్నారు. కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఢిల్లీలో ఆస్పత్రిలో ఐసీయూలో చేరారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నానని ఇటీవల రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. తన తండ్రి అనారోగ్యం కారణంగా పార్టీ కార్యకర్తలను కలవలేనని చిరాగ్ తెలిపారు. కరోనా సంక్షోభంలో తన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి ప్రజలకు సేవ చేశారని చిరాగ్ అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com