కాంగ్రెస్ సీనియర్ నేతలు బీజేపీలో చేరండి: రాందాస్ అథవాలే
కాంగ్రెస్ నేతలు తమ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సూచించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ బీజేపీలో చేరితే మంచిదని అన్నారు. కాంగ్రెస్ కోసం సిబల్, ఆజాద్ ఎన్నో ఏళ్లుగా ఎంతో చేశారని.. అయితే, చివరకి వారికి సరైన గౌరవం దక్కకపోవడం శోచనీయమని అన్నారు. రానున్న కాలంలో బీజేపీ దేశంలో మరింత బలపడుతుందని అన్నారు. కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని.. ఎన్డీఏకు తిరుగులేదని తెలిపారు. ఇప్పటికే.. కాంగ్రెస్ నుంచి జ్యోతిరాదిత్య సింథియా బీజేపీలో చేరారని.. ఇంకా చాలా మంది బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కులమతాలకతీతంగా బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని.. రానున్న కాలంలో మరింత శక్తివంతంగా బీజేపీ అవతరిస్తుందని అథవాలే ధీమా వ్యక్తం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com