క్రెడిట్, డెబిట్ కార్డులు వాడేవారికి ఆర్బీఐ గుడ్న్యూస్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్, డెబిట్ కార్డులు వాడే వారి కోసం ఓ కొత్త రూల్ తీసుకువచ్చింది. డిజిటల్ పేమెంట్స్ని పెంచాలనే లక్ష్యంతో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కాంటాక్ట్ లెస్ కార్డుల ట్రాన్సాక్షన్ లిమిట్ను పెంచుతున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుతం ఉన్న రూ.2,000 నుంచి రూ.5,000 వరకు పెంచుతున్నట్లు వివరించింది. అంటే రూ.5 వేల వరకు ట్రాన్సాక్షన్లకు ఇకపై పిన్ ఎంటర్ చేయాల్సిన పనిలేదు. సులభంగానే లావాదేవీలు పూర్తి చేయవచ్చు.
ఈ కొత్త రూల్ జనవరి 1 నుంచి అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం బ్యాంకులు వారి కస్టమర్లకు కాంటాక్ట్లెస్ క్రెడిట్, డెబిట్ కార్డులను అందిస్తున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో కాంటాక్ట్ లెస్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆర్బీఐ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మరోవైపు ఆర్బీఐ మరో కీలక అంశాన్ని కూడా వెల్లడించింది. ఆర్టీజీఎస్ లావాదేవీలు కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే బ్యాంక్ కస్టమర్లు ఎప్పుడైనా ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులు పంపించొచ్చు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com