ఎవరీ రియా చక్రవర్తి..

ఎవరీ రియా చక్రవర్తి..
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో రియా చక్రవర్తి పేరు ఎక్కువగా వార్తల్లో వినిపిస్తోంది. బాలీవుడ్ లో కథానాయికగా గుర్తింపు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో రియా చక్రవర్తి పేరు ఎక్కువగా వార్తల్లో వినిపిస్తోంది. బాలీవుడ్ లో కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న రియా.. సుశాంత్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటోంది. సుశాంత్ కేసులో కేంద్ర బిందువుగా మారిన రియా బెంగళూరులో 1992 జూలై 1న జన్మించింది. ఆర్మీ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించింది. తండ్రి ఇంద్రజిత్ భారత సైన్యంలో డాక్టర్ గా పనిచేశారు. తల్లి సంధ్య గృహిణి. రియా తమ్ముడు షోయిక్ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో కొంతకాలం అక్కడి నుంచి బాంబే స్కాటిష్ పాఠశాల విద్యను పూర్తి చేశాడు. కెనడాలోని థాంప్సన్ రివర్స్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు. 2012 లో తెలుగు చిత్రం తునీగా తునీగా చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చింది.

ఆ మరుసటి సంవత్సరం మేరే డాడ్ కి మారుతి చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. రియా మహేష్ భట్ ప్రొడక్షన్ లో ఐదు చిత్రాలు చేసింది. ఆ సమయంలో రియా మహేష్ భట్ తో సన్నిహితంగా ఉన్న చిత్రాలను పోస్ట్ చేసి వివాదంలో ఇరుక్కుంది. 2019 ఏప్రిల్ లో, రియా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో డేటింగ్ ప్రారంభించిందని ఆరోపణలు వచ్చాయి. వీరిద్దరూ తమ సంబంధాన్ని ఎప్పుడూ ధృవీకరించనప్పటికీ, ఈ జనవరిలో రియా సుశాంత్ తో డేటింగ్ వార్తను నిజం చేస్తూ ఇన్‌స్టా-అఫీషియల్‌గా పోస్ట్ పెట్టింది. సుశాంత్ మరణం తరువాత, రియా సోషల్ మీడియాకు దూరంగా ఉంది. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించారు. రియా సీబీఐ విచారణపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపింది. నిజం కచ్చితంగా బయటపడుతుంది. సుశాంత్ కుటుంబసభ్యులు తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, ఆ విషయాలు దర్యాప్తు సంస్థలకే వదిలేస్తే మంచిదని రియా వ్యాఖ్యానించింది.

Tags

Read MoreRead Less
Next Story