కస్టమర్ల భద్రత కోసం ఎస్బీఐ కొత్త ఫీచర్..
By - prasanna |4 Sep 2020 8:06 AM GMT
అనధికార లావాదేవీలు జరుగుతున్న్లట్లయితే ఖాతాదారుడు వెంటనే స్పందించి తన ఏటీఎమ్ కార్డును బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
తమ ఖాతాదారుల భద్రత కోసం భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో ముందడుగు వేసింది. ఏటీఎం మోసాలను అరికట్టేందుకు ఓ కొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది. ఇకపై డబ్బులు డ్రా చేసినప్పుడే కాకుండా బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసినప్పుడు, మినీ స్టేట్ మెంట్ తీసుకున్నప్పుడు కూడా మొబైల్ కు మెసేజ్ వస్తుంది. ఈ అలర్ట్ మెసేజ్ కారణంగా అనధికార లావాదేవీలు జరుగుతున్న్లట్లయితే సదరు ఖాతాదారుడు వెంటనే స్పందించి తన ఏటీఎమ్ కార్డును బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ కొత్త ఫీచర్ కు సంబంధించిన వివరాలు ఎస్బీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో మంగళవారం వెల్లడించింది. వీటికి సంబంధించిన మెసేజ్ లను నిర్లక్ష్యం చేయవద్దని ఎస్బీఐ పేర్కొంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com