బెంగాల్లో ప్రారంభమైన ఆరో దశ పోలింగ్..
By - TV5 Digital Team |22 April 2021 6:15 AM GMT
పశ్చిమబెంగాల్లో ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 43 స్థానాల్లో 306 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 4 జిల్లాల్లోని 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది.
పశ్చిమబెంగాల్లో ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 43 స్థానాల్లో 306 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 4 జిల్లాల్లోని 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే బెంగాల్లో ఐదు విడతల పోలింగ్ పూర్తయింది. నాలుగో విడత ఎన్నికల సందర్భంగా పోలీసు కాల్పుల్లో ఐదుగురు మరణించిన నేపథ్యంలో ఈసారి భారీస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 1071 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. ఇక ఇప్పటికే 180 స్థానాలకు మొదటి ఐదు దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మిగిలిన 114 స్థానాలకు ఈనెల 22, 29న రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఫలితాలను మే 2న ప్రకటించనున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com