ఎస్పీ ఆరోగ్యం ఎలా ఉంది.. అభిమానుల్లో ఆందోళన

ప్రముఖ సంగీత గాయకుడు ఎస్పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ఎలా ఉందో అని అభిమానుల్లో ఆందోళన నెలకొంది. గత నెల రోజుల నుండి కోవిడ్తో పోరాడుతున్న ప్రముఖ ప్లేబ్యాక్ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం "చాలా క్లిష్టమైన" స్థితిలో ఉన్నారని ఆయనకు చికిత్స చేస్తున్న ఆసుపత్రి గురువారం తెలిపింది. చెన్నైలోని ఎంజిఎం హెల్త్కేర్ నుండి వచ్చిన బులెటిన్ అతని పరిస్థితి క్షీణించిందని చెప్పారు. ఎస్పిబిగా అభిమానించిన ప్రఖ్యాత గాయకుడిని ఆగస్టు ప్రారంభంలో కరోనాకు సంబంధించి తేలికపాటి లక్షణాలతో ఆసుపత్రిలో చేర్చారు. అప్పటికి, అతను నేను ఆరోగ్యంగానే ఉన్నాను..
త్వరలో కోలుకుని బయటికి వస్తాను అని ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆగస్టు 13 న, బాలుకి ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో అతన్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్కు తరలించారు. అప్పటి నుండి అతడిని వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.బాలసుబ్రహ్మణ్యంకి వైద్యులు చికిత్సలో భాగంగా తరువాతి దశలో ప్లాస్మా థెరపీ, ఫిజియోథెరపీ చేశారు. అనంతరం అతడి పరిస్థితి మెరుగుపడుతున్నట్లు వైద్యులు, కుటుంబసభ్యులు భావించారు. బాలు వెంటిలేటర్ మరియు ECMO (ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్) సపోర్టుతో ఉన్నారు. కానీ అంతలోనే చికిత్సకు స్పందించట్లేదని, అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
ఎస్పీబీ కుమారుడు ఎస్పీ చరణ్ తరచూ తండ్రి ఆరోగ్యం గురించిన సమాచారాన్ని విడుదల చేస్తుండేవారు. నాన్న ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉందని ఇటీవల సెప్టెంబర్ 19 నాటికి, తన తండ్రి నోటితో ఆహారం తీసుకోవడం ప్రారంభించాడని వెల్లడించారు. ఆహారం తీసుకోవడం ప్రారంభించిన తరువాత తండ్రి ఆరోగ్యం మెరుగు పడుతుందని కుమారుడు చరణ్తో పాటు అభిమానులూ భావించారు. కానీ ఇప్పుడు బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. బాలు ఆరోగ్యంపై చిత్ర పరిశ్రమ ఆందోళన చెందుతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com