సౌందర్య మరణంతో ఆగిపోయిన బాలకృష్ణ చిత్రం..

ఆ పాత్రలో ఆమెనే ఊహించుకున్నారు దర్శకుడు.. ద్రౌపదిగా ఆమె అయితేనే సరిగ్గా సరిపోతుందనుకున్నారు.. అందం, అభినయం, మంచితనం మూర్తీభవించిన సౌందర్య నటన చిత్రానికే హైలెట్ అవుతుందనుకున్నారు.. కానీ ఆ చిత్రం షూటింగ్ మొదలు పెట్టిన కొన్ని రోజులకే సౌందర్య అనూహ్య మరణం 'నర్తనశాల' ఆగిపోవడానికి కారణమైంది.. ద్రౌపది పాత్రలో మరెవరినీ ఊహించుకోలేని సహనటుడు బాలకృష్ణ సైతం మరొకరిని పెట్టి షూటింగ్ పూర్తి చేయడానికి అంగీకరించలేకపోయారు.. సౌందర్య లాంటి నటి కనపడితే తప్పకుండా ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చిత్ర యూనిట్ తో పాటు బాలకృష్ణ పలు సందర్భాల్లో చెప్పారు. బాలకృష్ణ మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఇలానే మధ్యలో ఆగిపోయిన మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి.. అవి కోడి రామకృష్ణ దర్శకత్వంలోని 'విక్రమ సింహ భూపతి', బి.గోపాల్ దర్శకత్వంలోని 'హర హర మహాదేవ' వంటి చిత్రాలు చిత్రీకరణకు నోచుకోలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com