Tourism: భారత దేశ పర్యాటకాన్ని పూర్వస్థితికి తెచ్చేందుకు కేంద్రం కృషి

Tourism: భారత దేశ పర్యాటకాన్ని పూర్వస్థితికి  తెచ్చేందుకు కేంద్రం కృషి
విజిట్‌ ఇండియా-2023 నినాదంతో ముందుకెళ్తున్న కేంద్ర ప్రభుత్వం

కరోనా తర్వాత భారత దేశ పర్యాటకాన్ని పూర్వస్థితికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపట్టిందన్నారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. అంతర్జాతీయ పర్యాటకుల తాకిడి పెరిగేలా మౌలిక వసతులను కల్పిస్తోందన్నారు. దేశంలో పర్యాటక అభివృద్ధికి విజిట్‌ ఇండియా-2023 నినాదంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. గుజరాత్‌లో జరిగిన జీ20 టూరిజం వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాల్లో ప్రారంభోపన్యాసం చేసిన కిషన్ రెడ్డి పర్యాటక రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఏప్రిల్‌లో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story