West Bengal : పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.. ముగ్గురు మృతి..!

West Bengal : పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.. ముగ్గురు మృతి..!
West Bengal : పశ్చిమ బెంగాల్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు.

West Bengal : పశ్చిమ బెంగాల్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. పట్నా నుంచి గౌహతి వెళ్తున్న గౌహతి - బికనేర్‌ ఎక్స్‌ప్రెస్‌ మైనాగురి సమీపంలో పట్టాలు తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో రైలు కేవలం 40 కిలోమీటర్ల వేగంతోనే ఉండడంతో.. పెను ప్రమాదం తప్పింది.

మొత్తం ఆరు బోగీలు తలకిందులు కాగా.. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో మొత్తం 12 కోచ్‌లు దెబ్బతిన్నాయని... సమాచారం తెలియగానే రైల్వే ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారని రైల్వే వర్గాలు తెలిపాయి. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని.. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారని.. అధికారులు వెల్లడించారు.


Tags

Read MoreRead Less
Next Story