UP: రిసెప్షన్ లోనే వరుడి చెంపలు వాయించిన పెళ్లి కూతురు.. కారణం..

దీంతో వధువు అతిధుల సమక్షంలోనే అతడి చెంపలు వాయించింది

దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన యుపిలో వరకట్నం ఆశించిన వరుడికి వధువు తండ్రి మరియు అతని కుటుంబం తన జీవితాంతం గుర్తుంచుకునే పాఠం నేర్పించారు. వరుడు వరకట్నంలో భాగంగా UP:బుల్లెట్ బైక్ ను అడిగాడు. దీంతో వధువు అతిధుల సమక్షంలోనే అతడి చెంపలు వాయించింది. ఇప్పుడు ఈ సంఘటన యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అమేథిలోని కేసరియా సలీంపూర్ గ్రామానికి చెందిన నమీమ్ అహ్మద్ తన కుమార్తెకు మే 17 న వివాహం చేశారు. వివాహం అయిన తరువాత రాయ్ బరేలి జిల్లాలోని రోఖా గ్రామం నుండి బరాత్ వచ్చారు వరుడు, అతని కుటుంబసభ్యులు.

మొహమ్మద్ అమీర్ వేదికపై కూర్చుని వివాహ ఆచారాలు జరుపుతున్నారు. వధువు కుటుంబ సభ్యులు బరాత్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. వివాహ వేడుక బంధుమిత్రుల మధ్య ఆనందంగా జరిగింది. ఇంతలో, వరుడు రిసెప్షన్ వేడుక సమయంలో అత్తమామల నుండి బుల్లెట్ బైక్ డిమాండ్ చేశాడు. వధువు తండ్రి కూడా అతడి డిమాండ్‌ను అంగీకరించి బుల్లెట్ బైక్ ఇవ్వడానికి అంగీకరించారు.

వధువు తండ్రి కూడా వరుడికి రూ .2 లక్షల చెక్ ఇచ్చాడు. కానీ వరుడు మరియు అతని తండ్రి బుల్లెట్ బైక్ ను డిమాండ్ చేశారు. వరుడికి ఇచ్చిన చెక్కును చించివేయడతో పాటు వేడుకలో గొడవ చేశారు. ఈ విషయం విడాకులకు దారితీసింది. వధువుతో పాటు గ్రామస్తులు, వరుడిని బందీగా చేసి కొట్టారు. వధువు కూడా కట్నం అత్యాశ ఉన్న వారి ఇంటికి తాను వెళ్ళనని అత్తారింటికి వెళ్లడానికి నిరాకరించింది.

Tags

Read MoreRead Less
Next Story