ఏపీకి వెళ్లొస్తారా.. బస్సులు తిరుగుతున్నాయ్..

ఏపీకి వెళ్లొస్తారా.. బస్సులు తిరుగుతున్నాయ్..
X
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులను సోమవారం నుంచి

కరోనా మహమ్మారి నేపధ్యంలో కొన్ని రాష్ట్రాలకు బస్సు సర్వీసులు నిలిపివేశారు.. మళ్లీ ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో రాష్ట్రాల మధ్య రాకపోకలు ప్రారంభమవుతున్నాయి. దాదాపు ఆరు నెలల అనంతరం ఆంధ్రాకు వెళ్లే అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులను సోమవారం నుంచి పునరుద్ధరించారు. ఇందులో భాగంగా విజయవాడ నుంచి హైదరాబాదుకు బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. 15 బస్సులకు మాత్రమే అనుమతిచ్చిన ఆర్టీసి కృష్ణా రీజియన్ నుంచి హైదరాబాద్‌కు సోమవారం రాత్రి నుంచి రిజర్వేషన్ కౌంటర్లు ఓపెన్ చేశారు. గతంలో కృష్ణా రీజియన్‌లో హైదరాబాద్‌కు 264 బస్సులు తిరిగేవి. అయితే వాటిని ఇప్పుడు 166 బస్సులకు కుదించారు.

అలాగే రాష్ట్రవ్యాప్తంగా విజయవాడ-హైదరాబాద్ మధ్య 1,060 బస్సు సర్వీసులు నడిచేవి. ప్రస్తుతం ఆ సంఖ్యను కూడా తగ్గించి 600 సర్వీసులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. గతంలో తెలంగాణలో సుమారు 2.61 లక్షల కిలో మీటర్లు బస్సులు తిరిగేందుకు ఏపీఎస్ ఆర్టీసీకి అనుమతి ఉండేది. అయితే రెండు రాష్ట్రాలు సరిసమానంగా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోయాయి. ఈ నేపధ్యంలో సోమవారం ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో బస్సు సర్వీసులు పునరుద్ధరించారు. ఈ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణ జరిగిందని వెల్లడించారు. సోమవారం నుంచి బస్సు సర్వీసులు ప్రారంభం అవుతాయని, ఆన్‌లైన్ బుకింగ్స్ కూడా ప్రారంభించినట్లు చెప్పారు. డిమాండ్‌ను బట్టి సర్వీసులు నడుపుతామని వివరించారు. సర్వీసులన్నీ ప్రారంభం కావడానికి సుమారు 5,6 నెలల సమయం పట్టొచ్చని వెల్లడించారు. ఈ ఆరు నెలల కాలంలో ఆర్టీసీ ఎదుర్కొన్న నష్టం రూ.2,400 కోట్లు అని తెలిపారు. ఇంటర్ స్టేట్ మధ్య అన్ని రకాల రవాణా వ్యవస్థలపై నెల రోజుల్లో మళ్లీ ఒక సమావేశం ఉంటుందని ఆర్టీసీ ఎండీ అన్నారు.

Tags

Next Story