UP Barabanki: వ్యాక్సిన్ భయం.. నదిలో దూకిన గ్రామస్థులు..

UP Barabanki:ఇంజక్షన్ అంటే భయం కొందరికి.. ఇక్కడి గ్రామస్ఠులకు కోవిడ్ టీకా అంటే భయం. అందుకే టీకాలు వేయడానికి ఆరోగ్య అధికారులు గ్రామానికి వస్తున్నారని తెలిసి నదిలో దూకేశారు.
టీకాల నుండి తప్పించుకోవడానికి ఉత్తర ప్రదేశ్ బారాబంకిలోని గ్రామస్తులు సరయు నదిలోకి దూకారు.
ఈ సంఘటన శనివారం జరిగిందని రామ్నగర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ తహసీల్ రాజీవ్ కుమార్ శుక్లా తెలిపారు.
టీకా యొక్క ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలను సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ వివరించారు. టీకాల పట్ల గ్రామస్థులకున్న అపోహలను తొలగించారు. అయినా 14 మంది మాత్రమే టీకాలు వేయించుకున్నారు. మిగిలిన వాళ్లు నదిలో దూకారు.
ఇది టీకా కాదని, విషపూరితమైన ఇంజెక్షన్ అని కొంతమంది చెప్పినందున వారు నదిలోకి దూకినట్లు గ్రామస్తులు తెలిపారు.
దేశం 11-44 సంవత్సరాల వయస్సులో తీవ్రమైన వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో కోవిడ్ వ్యాప్తిని తగ్గించడానికి టీకాలు వేయించుకోవలసిన ఆవశ్యకతను నిపుణులు నొక్కి చెబుతున్నారు.
తాజాగా కేసులు తగ్గుతున్నప్పటికీ, రోజువారీ మరణాల సంఖ్య దేశంలో పెరుగుతూనే ఉంది,.
కేసులు పెరుగుతుండడంతో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై అధిక భారం పడుతోంది. కోవిడ్ వ్యాప్తి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకి కూడా చేరుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com