Vinesh Phoghat: నేనున్నా.. డోన్ట్ వర్రీ...!

Vinesh Phoghat: నేనున్నా.. డోన్ట్ వర్రీ...!
X
జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరశన కార్యక్రమంలో బబితా ఫోగట్, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానంటూ హామీ....

ప్రపంచ ఛాంపియన్, భాజాపా నేత బబితా ఫోగట్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న మీటూ నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు. చెల్లి వినేశ్ ఫోగట్ కు మద్దతు తెలిపేందుకు కాకుండా, ప్రభుత్వం తరఫున తాను ఇక్కడికి వచ్చినట్లు బబిత పేర్కొన్నారు.


ప్రభుత్వం మీ తరుఫునే నిలబడుతుందని వారికి హామీ ఇచ్చినట్లు బబిత పేర్కొన్నారు. ఈరోజే వారి సమస్యలకు పరిష్కారం సూచించబోతున్నట్లు వెల్లడించారు.


గత రెండు రోజులుగా రెజ్లింగ్ క్రీడాకారిణులు అధికారులకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద నిరశన చేస్తున్న సంగతి తెలిసిందే. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, ఇతర అధికారులు క్రిడాకారుణులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.



Tags

Next Story