మమత బెర్ముడాలు ధరిస్తే కాలు బాగా.. : భాజపా ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ మమత కాలి గాయం గురించి వావాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తన ప్రసంగంలో, బిజెపి నాయకుడు సిఎం మమతా వేషధారణ గురించి వ్యాఖ్యలు చేశారు - ఆమె ఉద్దేశపూర్వకంగా తన కాలుకు బ్యాండేజ్ వేసుకున్నారని ఆరోపించారు.
బిజెపి బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మంగళవారం పురులియా జిల్లా బాండ్వాన్ లోని బోరో ప్రాంతంలో జరిగిన ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు.
"ప్రజలు ఆమె ముఖాన్ని చూడడానికి ఇష్టఃపడడం లేదు, అందుకే ఆమె విరిగిన కాలును చూపిస్తోంది.. అయినా ఆమె ధరించిన చీర కాలి గాయాన్ని కప్పేస్తుంది. అందుకే చీర బదులు బెర్ముడా ధరించండి అంటూ ఉచిత సలహా ఇచ్చి వివాదంలో చిక్కుకున్నారు. దీంతో మమత వర్గీయులు, నెటిజన్స్ ఓ రేంజ్లో దిలీప్ ఘోష్ని ఓ రేంజ్లో వేసుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com