West Bengal : రంజాన్ ఉపవాస విరమణ... ఫుడ్ పాయిజన్ తో 100మందికి పైగా అస్వస్థత

West Bengal : రంజాన్ ఉపవాస విరమణ...  ఫుడ్ పాయిజన్ తో 100మందికి పైగా అస్వస్థత
X

రంజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. ముస్లింలు రంజాన్ మాసంలో ఉపవాసం ఉండి ప్రతీరోజు సాయంత్రం ఉపవాసాన్ని విరమణ చేస్తారు. అందులో భాగంగా.. పశ్చిమ బెంగాల్ లోని ఓ మసీదులో స్థానిక ముస్లింలు ఉపవాసాన్ని విరమించడానికి పళ్లు తీసుకున్నారు. తిన్న కొద్దిసేపటికే వంద మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్ లోని సౌత్ 24 పరగణాస్ లోని ఓ మసీదులో జరిగినట్లు పోలీసులు తెలిపారు. వీరు కొల్ కతా లోని వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఇఫ్తార్ తిన్న వారిలో ఒకరి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసారు.


ఫుడ్ పాయిజన్ కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని డాక్టర్లు తెలిపారు. "నిన్న రాత్రి, వాంతులు, కడుపు నొప్పితో కొంతమంది అనారోగ్యంతో నా నర్సింగ్‌హోమ్‌లోకి వచ్చారు. రోజా తర్వాత వారు భోజనం చేసిన ఇఫ్తార్ విందులో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఈ సంఘటన జరిగిందని మేము భావిస్తున్నాము" అని డాక్టర్ హోరిసాధన్ మోండల్ చెప్పారు. శుక్రవారం ఈ ఘటన జరుగగా శనివారానికి కేసులు పెరిగినట్లు తెలుస్తోంది.

Next Story