బెంగాల్లో తొలి దశ ఎన్నికలు.. ముగిసిన ఫస్ట్ ఫేస్ ప్రచారం

పశ్చిమ బెంగాల్లో ఐదు జిల్లాల పరిధిలోని 30 అసెంబ్లీ స్థానాలకు శనివారం మొదటి విడతలో పోలింగ్ జరగనుంది. అలాగే అసోంలో తొలి దశలో 47 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అసోంలో మూడు దశలు, బెంగాల్లో ఎనిమిది దశల్లో పోలింగ్ జరగనుంది. మార్చ్ 27న మొదలయ్యే పోలింగ్ ఏప్రిల్ 29తో ముగుస్తుంది. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. ఫస్ట్ ఫేస్ ప్రచారం ముగియడంతో 77 నియోజకవర్గాల్లో మైకులు మూగబోయాయి.
బెంగాల్లోలోని పశ్చిమ మిడ్నాపూర్, తూర్పు మిడ్నాపూర్, బంకురా, జార్గ్రామ్, పురులియా జిల్లాల్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రచారపర్వం ముగియడంతోపార్టీలన్నీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు అత్యంత ఉత్కంఠను రేపుతున్నాయి. తొలిసారి బెంగాల్లో కాలుమోపేందుకు బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. అందుకే ప్రధాని మోదీతోపాటు స్టార్ క్యాంపేనర్లందరూ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. అటు టీఎంసీ తరపున అన్నీ తానై వ్యవహరించారు సీఎం మమతా బెనర్జీ.. బీజేపీ విమర్శలను తిప్పుకొడుతూ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. అయితే ప్రీపోల్ సర్వేలు మాత్రం మరోసారి మమత సర్కారుకే పట్టం కట్టడంతో ఈ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి.
తొలి దశ ఎన్నికలు జరుగుతున్న ఈ ఐదు జిల్లాల్లో 2016లో టీఎంసీ భారీగా సీట్లు కైవసం చేసుకుంది. 30 సీట్లలో మొత్తం 27 టీఎంసీ గెలుచుకోగా… కాంగ్రెస్ రెండు సీట్లు, ఆర్ఎస్పీ ఒక స్థానంలో గెలుపొందింది. ఈ సారి కూడా 27 సీట్లు దక్కించుకుంటామని టీఎంసీ ధీమా వ్యక్తం చేస్తోంది.. మొత్తం 191 అభ్యర్థులు బరిలో ఉన్న 30 స్థానాల్లో 48 మందిపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇక 42 మంది అభ్యర్థులపై సీరియస్ క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని ఏడీఆర్ సంస్థ వెల్లడించింది. ఇక 19 మంది ధనవంతులు ఎన్నికల బరిలో ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com