Mamata Banerjee : శరద్పవార్తో సీఎం మమతా బెనర్జీ భేటీ..!
By - TV5 Digital Team |1 Dec 2021 12:30 PM GMT
Mamata Banerjee : జాతీయ రాజకీయాలను శాసించడమే లక్ష్యంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అడుగులు వేస్తున్నారు.
Mamata Banerjee : జాతీయ రాజకీయాలను శాసించడమే లక్ష్యంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అడుగులు వేస్తున్నారు. అందుకు అన్ని రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు. ముంబైలో ఎన్సీపీ అధినేత శరద్పవార్తో భేటీ అయిన మమతా.. సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీయేది ముగిసిన చరిత్ర అని.. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ డీలా పడిందని, యూపీఏ ఇప్పుడు ఉనికిలో లేదన్నారు. బీజేపీని ఢీకొట్టాలంటే బలమైన ప్రత్యామ్నాయం కావాలని శరద్పవార్ అన్నారు. పలు అంశాలపై చర్చించిన మమతా, శరద్ పవార్ ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షించడానికి కలిసికట్టుగా పనిచేయాలని ఏకాభిప్రాయానికి వచ్చారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com