Raksha Bandhan 2022: రాఖీ పండుగను ఎప్పుడు జరుపుకోవాలి? సోదరుడికి రాఖీ ఎప్పుడు కట్టాలి..
Raksha Bandhan 2022: సోదరుడు, సోదరి మధ్య అనుబంధం, ఆప్యాయతలకు ప్రతీక రాఖీ పౌర్ణమి. అయితే ఈసారి రాకీ పండుగను ఎప్పుడు ఎప్పుడు జరుపుకోవాలి అనేది అందరికీ వస్తున్న అనుమానం.
రక్షా బంధన్ పండుగ చాలా మంది ఎదురుచూస్తున్న హిందూ పండుగలలో ఒకటి. రక్షా బంధన్ శ్రావణ మాసంలో శుక్ల పక్షం పూర్ణిమ తిథి నాడు వస్తుంది. మతపరమైన నమ్మకం ప్రకారం రాఖీని శుభ సమయంలో కట్టాలి. ఎందుకంటే దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది.
రక్షా బంధన్ 2022 ఎప్పుడు?
రక్షా బంధన్ను పురస్కరించుకుని శుభ ముహూర్తం గురించి చాలా మంది చెబుతున్నారు. ఆగస్టు 11 అని కొందరంటే మరికొందరు ఆగస్టు 12 అని అంటున్నారు. అయితే సరిగ్గా రక్షా బంధన్ ఎప్పుడు? ఆగస్ట్ 12న భాద్రతో కూడిన పూర్ణిమ తిథి అని పండితుల అభిప్రాయం. మరి పంచాంగం ఏం చెబుతుంది?
దృక్ పంచాంగ్ ప్రకారం, శ్రావణ పూర్ణిమ ఆగష్టు 11 న జరుపుకుంటారు. ఉదయం 10.38 గంటలకు ప్రారంభమై ఆగస్టు 12 ఉదయం 7.05 గంటలకు ముగుస్తుంది. రక్షా బంధన్ రోజున రాఖీ కట్టడానికి ఉత్తమ సమయం అపరాహ్న సమయం. ఇది మధ్యాహ్నం వస్తుంది. అపరాహ్న సమయంలో వీలుకాకపోతే ప్రదోష సమయం కూడా అనుకూలంగా ఉంటుంది.
రక్షా బంధన ఆచారాలు భద్ర సమయంలో చేయకూడదు. భద్ర అనేది అన్ని శుభ కార్యాలకు దూరంగా ఉండవలసిన సమయం. చాలా హిందూ మత గ్రంథాలు భద్ర సమయంలో రాఖీ కట్టకూడదని సలహా ఇస్తున్నాయి. పూర్ణిమ తిథి ప్రథమార్ధంలో భద్రాధిపత్యం ఉంటుందని గమనించాలి. అందుచేత ఏదైనా శుభ కార్యాన్ని ప్రారంభించే ముందు భద్ర వచ్చే వరకు వేచి ఉండాలి.
రక్షా బంధన్ శుభ ముహూర్తం
దృక్ పంచాంగ్ ప్రకారం, ప్రదోష సమయాలు ఆగస్టు 11న రాత్రి 8:51 నుండి 9:13 వరకు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com