Mumbai: మహిళ ప్రాణం తీసిన ఎలుకల మందు..

Mumbai: మహిళ ప్రాణం తీసిన ఎలుకల మందు..
Mumbai: ఆమె చేసిన చిన్న పొరపాటు ఆమె ప్రాణాలు హరించింది. ముందు రోజు ఎలుకలకు మందు పెట్టింది.

Mumbai: ఆమె చేసిన చిన్న పొరపాటు ఆమె ప్రాణాలు హరించింది. ముందు రోజు ఎలుకలకు మందు పెట్టింది. దానికి ఇంట్లో ఉన్న టమోటాలు వాడింది. ఎలుకలు అది తిని చచ్చాయో లేదో కానీ.. ఆమె మాత్రం ఆ విషయం మర్చిపోయి మూలన ఉంచిన టమోటా తీసుకు వచ్చి దాన్ని నూడిల్స్‌లో వేసుకుని తిన్నది. దాంతో ఆమెకు వాంతులు, విరోచనాలు పట్టుకున్నాయి. ఆస్పత్రికి వెళ్లినా తగ్గలేదు. చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఈ ఘటన ముంబైలోని మలాడ్‌లోని పాస్కల్ వాడి ప్రాంతంలో చోటుచేసుకుంది. 27 ఏళ్ల మహిళ ప్రమాదవశాత్తూ ఎలుకల మందు కలిపిన ఆహారం తీసుకుని మృతి చెందింది. ఇన్‌స్టంట్ నూడుల్స్ తయారు చేస్తుండగా, ఆ మహిళ పొరపాటున ఎలుకల మందు కలిపిన టొమాటోను వేసింది.

రేఖ నిషాద్ అనే మహిళ జూలై 21న ఇంట్లో ఎలుకలను చంపేందుకు టొమాటోలలో మందు కలిపింది. టీవీ ధ్యాసలో పడి ఆమె ఏం చేస్తుందో తనకే తెలియలేదు. ఎలుకలకు పెట్టిన టమోటాలను ఉపయోగించింది. భోజనం చేసిన కొన్ని గంటలకే ఆమె వాంతులు చేసుకోవడం ప్రారంభించింది. వెంటనే ఆమెను భర్త సమీప ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మహిళ మృతి చెందింది.

Tags

Read MoreRead Less
Next Story