Yoga Day: యోగా ఇకపై జీవితంలో ఒక భాగం కాదు, జీవిత మార్గం: ప్రధాని మోదీ

Yoga Day: యోగా ఇకపై జీవితంలో ఒక భాగం కాదు, జీవిత మార్గం: ప్రధాని మోదీ
Yoga Day: మైసూర్ ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేసి ప్రసంగించారు.

Yoga Day: మైసూర్ ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేసి ప్రసంగించారు. వ్యక్తుల జీవితంలో యోగా ప్రాముఖ్యతను వివరించారు. అన్ని సమస్యలకు ఓ చక్కని పరిష్కారం యోగా అని అన్నారు. అంతర్గత శాంతిని కలిగిస్తుందని అన్నారు.

యోగా ఇకపై జీవితంలో భాగం కాదు, అది ఒక జీవన విధానంగా మారుతోంది అని మోదీ అన్నారు. కర్ణాటకలోని మైసూరు ప్యాలెస్ నుండి యోగా దినోత్సవ వేడుకలకు నాయకత్వం వహించిన మోడీ అన్నారు.

మైసూర్ ప్యాలెస్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, యోగా అనేది సమస్యల పరిష్కారమ, అంతర్గత శాంతిని కలిగిస్తుందని అన్నారు. "యోగా కేవలం వ్యక్తులకు కాదు. మన సమాజానికి కూడా యోగా శాంతిని కలిగిస్తుంది. యోగా దేశాలకు, ప్రపంచానికి కూడా శాంతిని తెస్తుంది. యోగా విశ్వానికి శాంతిని తెస్తుంది" అని ఆయన అన్నారు.


ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్, కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి బసవరాజ్ ఎస్ బొమ్మై పాల్గొన్నారు. "మనం ఎంత ఒత్తిడితో కూడిన వాతావరణంలో ఉన్నప్పటికీ, కొన్ని నిమిషాల పాటు ధ్యానం మనల్ని రిలాక్స్ చేస్తుంది. కాబట్టి మనం యోగాను ఒక పనిగా భావించరాదు. యోగా గురించి తెలుసుకోవాలి, యోగాతో కలిసి జీవించాలి, దానిని మన స్వంతం చేసుకోవాలి" అని ప్రధాని మంత్రి అన్నారు.

యోగా ఇప్పుడు జీవితంలో ఒక భాగం కాదు, అది ఒక జీవన విధానంగా మారుతోంది. "యోగా మనలోని ప్రతిదాని గురించి మనకు స్పృహ కలిగిస్తుంది, అవగాహనను పెంపొందిస్తుంది" అని ప్రధాన మంత్రి అన్నారు.

2015 నుండి, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం యోగా దినోత్సవం యొక్క థీమ్ "యోగా ఫర్ హ్యుమానిటీ". 75 మంది కేంద్ర మంత్రులు ఈ ఏడాది 75 ప్రముఖ ప్రదేశాలలో యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story