కరోనా వైరస్కు మార్కెట్లోకి మరో కొత్త ఔషధం..!

X
By - TV5 Digital Team |23 April 2021 5:37 PM IST
కరోనా వైరస్ కు మరో కొత్త ఔషధం వచ్చింది. జైడస్ సంస్థ రూపొందించిన విరాఫిన్ మందుకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కరోనా వైరస్ కు మరో కొత్త ఔషధం వచ్చింది. జైడస్ సంస్థ రూపొందించిన విరాఫిన్ మందుకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మధ్యస్థ కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి ఈ సూదిమందు సింగిల్ డోస్లో పనిచేస్తుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. కరోనా చికిత్సలో విరాఫిన్ డ్రగ్ సమర్థవంతంగా పనిచేస్తోందని జైడస్ సంస్థ ప్రకటించింది.. విరాఫిన్ డ్రగ్ తీసుకున్న 91 శాతం మంది పేషెంట్లు ఏడు రోజుల్లోనే కరోనా నుంచి కోలుకున్నట్లు వెల్లడించింది.. ఈ నేపథ్యంలో ఈ మందు అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతి ఇచ్చింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com