Delhi : ఢిల్లీలో దారుణ ఘటన.. 20ఏళ్ల యువతి పై...

Delhi : ఢిల్లీలో దారుణ ఘటన.. 20ఏళ్ల యువతి పై...
దేశరాజధానిలో అరాచకం: మహిళను ఢీకొట్టి, 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు

న్యూ ఇయర్‌ రోజున ఢిల్లీ రాజధానిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తోన్న ఓ 20 ఏళ్ల యువతిని కారు ఢీకొట్టింది. అంతేకాకుండా ఆ యువతిని 10-12 కిలోమీటర్ల పాటు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో యువతి అక్కడిక్కడే మృతిచెందింది. న్యూఇయర్‌ రోజున తెల్లవారు జామున గం.3:30నిల.కి చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.


మద్యం మత్తులో కారును నడుపుతున్న నలుగురు యువకులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఎదురుగా వచ్చిన స్కూటీని ఢీకొట్టిగా స్కూటీతో పాటు దానిని నడుపుతున్న యువతి కారు కింద పడిపోయింది. ఈ విషయాన్ని గమనించకుండా యువతిని అలాగే 12 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లారు. తీవ్రగాయాలతో ఆ యువతి రోడ్డుపైనే ప్రాణాలు విడిచింది.

ఈ ఘనలో యువతి నగ్నంగా రోడ్డు పై పడివుండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్ధలానికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. CCTV ఫుటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.


ప్రమాద సమయంలో నలుగురు మద్యం మత్తులో ఉన్నారా? లేక డ్రగ్స్‌ తీసుకున్నారా అనే కోణాల్లో విచారణ సాగుతోంది. అంతేకాక ఈ ప్రమాదంలో యువతి పై లైంగిక వేధింపులు జరిగి ఉండవచ్చన్న పలు సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story