Pakistan : పాకిస్థాన్ను ముంచేస్తున్న వరదలు.. నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించిన పాక్ ప్రభుత్వం..

Pakistan : పాకిస్థాన్ను ఇప్పుడు ఆ దేశ ఆర్థిక సంక్షోభం కంటే వరదలే అతలాకుతలం చేస్తున్నారు. ఈ ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు ఇప్పటి వరకు 937 మంది మృతి చెందారు. అందులో 343 మంది చిన్నారులు కావడం హదయవిదారకం. సుమారు 3 కోట్ల మంది పాకిస్థాన్లో నిరాశ్రయులయ్యారు. ప్రతి ఏటా కురిసే వర్షాల కంటే ఈ సారి 241 శాతం ఎక్కువ కురిసింది. పాక్ ప్రభుత్వం వెంటనే నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించింది. సింధ్, బలుచిస్థాన్ ప్రాంతంలో అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయారు. గతేడాది 48 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయితే.. ఈ సారి 166 సెంటిమీటర్లు కురిసింది.
సహాయక చర్యలు చేపట్టడానికి ఎన్డీఎంఏలో సహాయక చర్యలు చేపట్టడానికి ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ 'వార్ రూమ్'ను ఏర్పాటు చేశారు. అసాధారణంగా కురిసిన వర్షాలకే ఈ వరదలు కారణమని అక్కడి వాతావరణ శాఖ తేల్చింది. సింధ్ బలూచిస్థాన్లో 784 శాతం, 496 శాతం అధికంగా వర్షపాతం కారణంగానే అధిక మరణాలకు కారణమయినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com