Revanth Reddy: రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన.. ప్రవాసీయులతో రాజకీయ పరిణామాలపై చర్చ..

X
By - Divya Reddy |4 Jun 2022 5:30 PM IST
Revanth Reddy: అమెరికా పర్యటనలో ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. టేనస్సీ రాష్ట్రంలోని నష్వెల్లి సిటీని సందర్శించారు.
Revanth Reddy: అమెరికా పర్యటనలో ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. టేనస్సీ రాష్ట్రంలోని నష్వెల్లి సిటీని సందర్శించారు. అమెరికా తెలుగు అసోసియేషన్ నష్వెల్లి బృందం ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లిన రేవంత్కు ప్రవాసీయులు ఘనస్వాగతం పలికారు. స్థానికులతో తాజా రాజకీయ పరిణామాలతో చర్చించారు. కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి, డాక్టర్ తిరుపతిరెడ్డితోపాటు నూకల రీజియన్ డైరెక్టర్ నరేందర్రెడ్డి, స్టాండింగ్ కమిటీ సభ్యులు సుశీల్ చంద్ర, కిషోర్ గూడూరు పాల్గొన్నారు. అటు వాషింగ్టన్లో జూలైలో జరిగే 17వ అమెరికా తెలుగు అసోసియేషన్ యూత్ కాన్ఫరెన్స్ కార్యక్రమానికి రేవంత్ను ఆహ్వానించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com