'పది' అర్హతతో ఇండియన్ రైల్వేలో ఉద్యోగాలు..

ఉత్తర మధ్య రైల్వేలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఇండియన్ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 480 పోస్టులను భర్తీ చేయనుంది. పదో తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులని ప్రకటించింది.
ఇందులో ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్ పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 16 వరకు అందుబాటులో ఉంటాయి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు. ఎంపికైన అభ్యర్తులు ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు : 480
వీటిలో ఫిట్టర్ 286, వెల్డర్ 11, మెకానిక్ (డీజిల్) 84, కార్పెంటర్ 11, ఎలక్ట్రీషియన్ 88 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ పూర్తి చేసి, 15 నుంచి 24 ఏండ్ల లోపు వారై ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్ధులు ట్రైనింగ్కు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.170, ఎస్సీ, ఎస్టీ అభ్యర్దులకు రూ.70
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 16
వెబ్సైట్: www.ncr.indianrailway.gov.in
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com