ECET: ECET కౌన్సిలింగ్‌ రిజిస్ట్రేషన్‌కి నేడే చివరి తేదీ..

ECET: ECET కౌన్సిలింగ్‌ రిజిస్ట్రేషన్‌కి నేడే చివరి తేదీ..
పాలిటెక్నిక్ విద్యార్థులకు బిగ్ అలర్ట్

పాలిటెక్నిక్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇంజినీరింగ్ ఎంట్రన్స్‌ కోసం ఈసెట్(ECET) పరీక్ష రాసిన పాలిటెక్నిక్ అభ్యర్థులకు కౌన్సిలింగ్‌కి రిజిస్ట్రేషన్‌కి గడువు నేటితో ముగియనుంది. అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ జులై 14న ప్రారంభించారు. ఈ రోజే దీనికి గడువు ముగియనుంది. విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా తమ సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

వెబ్ కౌన్సెలింగ్‌కి ఫీజు బీసీ విద్యార్థులకు 1200/-, ఎస్సీ, ఎస్టీ రూ.600/- గా నిర్ణయించారు. అభ్యర్థులు ఈ రుసుంని క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.

AP ECET కౌన్సెలింగ్ 2023 రిజిస్ట్రేషన్ ఇలా చేస్కోండి..

---> cet-sche.aptonline.in లో AP ECET యొక్క అధికారిక సైట్‌ని సందర్శించండి.

----> హోమ్ పేజీలో AP ECET 2023 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.

----> ముందుగా మీ వివరాలతో నమోదు చేసుకోండి మరియు అవే లాగిన్ డిటెయిల్స్‌తో మీ ఖాతాకు లాగిన్ అవ్వండి.

----> తర్వాత పేజీలో దరఖాస్తు ఫాంను పూర్తి చేసి, దరఖాస్తు రుసుము చెల్లించండి.

----> అవసరమైన విద్యార్హత, ఇతర ధృవీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయండి.

----> సబ్‌మిట్‌(SUBMIT)పై క్లిక్ చేసి, నిర్ధారణ పేజీని డౌన్‌లోడ్ చేయండి.

----> తదుపరి అవసరం కోసం అదే హార్డ్ కాపీని ఉంచండి.



Tags

Read MoreRead Less
Next Story