Indian Army: ఇంజనీరీంగ్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. జీతం రూ. 56,100

Indian Army: ఇండియన్ ఆర్మీ OTA పోస్టుల భర్తీ కోసం ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 191 SSC (టెక్) పోస్ట్లు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA), ఇండియన్ ఆర్మీ జూనియర్ ఆఫీసర్ ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల దరఖాస్తుదారులు 6 ఏప్రిల్ 2022 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు..
ఇండియన్ ఆర్మీ చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA) అక్టోబర్ 2022 సంవత్సరానికి 59వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) పురుషులు మరియు 30వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) ఉమెన్ కోర్సు నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ఇండియన్ ఆర్మీ OTA రిక్రూట్మెంట్ 2022
సంస్థ పేరు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA), ఇండియన్ ఆర్మీ
మొత్తం పోస్ట్లు 191
పోస్ట్ పేరు షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) పురుషులు / మహిళలు (అక్టోబర్ 2022) కోర్సు
అర్హత ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ
దరఖాస్తు చివరి తేదీ 06.04.2022
అధికారిక వెబ్సైట్ http://joinindianarmy.nic.in/
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA), చెన్నై అధికారులు వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు.
వయో పరిమితి
SSC (టెక్) పురుషులు / మహిళలు - 01.10.2022 నాటికి 20-27 సంవత్సరాల మధ్య ఉండాలి. వితంతువులకు 01.10.2022 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
గరిష్ట వయోపరిమితిలో SC/ST & PWD అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
పే స్కేల్: రూ.56,100
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థులు వ్రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు.
ఇండియన్ ఆర్మీ OTA రిక్రూట్మెంట్ 2022 ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ http://joinindianarmy.nic.in/ ని సందర్శించి పూర్తి వివరాలు చదివి అప్లై చేయాలి. అనంతరం దరఖాస్తు ఫారంని ప్రింటవుట్ తీసి దగ్గర ఉంచుకోవాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com