నిరుద్యోగులు అలర్ట్: 1.40 లక్షల పోస్టుల భర్తీకి సిద్దమవుతున్న రైల్వేశాఖ
By - shanmukha |5 Sep 2020 3:45 PM GMT
నిరుద్యోగులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. గతంలో లక్ష 40వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన రైల్వే శాఖ
నిరుద్యోగులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. గతంలో లక్ష 40వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన రైల్వే శాఖ ఖాళీలను భర్తీ చేయడానికి సన్నద్దం అవుతుంది. మొత్తం 1,40,640 పోస్టుల భర్తీ కోసం రైల్వే నోటిఫికేషన్ జారీ చేయగా, 2.42 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. దీనిక సంబందించిన కంప్యూటర్ పరీక్షలను డిశంబర్ 15 నుంచి నిర్వహించనున్నారు. రైల్వేలో మూడు కేటగిరీల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే, కరోనా కారణంగా పరీక్షలు నిలిపివేసింది. ప్రస్తుతం అన్లాక్ ప్రకటించడంతో పరీక్షలకు సంబంధించి త్వరలోనే షెడ్యూలు విడుదల చేయనుంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com