ఎస్బీఐలో 2 వేల ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టులు.. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారికీ అవకాశం..

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. 2000 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 2000 ఖాళీల్లో 200 పోస్టుల్ని ఎకనమీకల్లీ వీకర్ సెక్షన్స్కి కేటాయించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. 2020 డిసెంబర్ 4 దరఖాస్తుకు చివరి తేదీ.
ప్రిలిమ్స్, మెయిన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ చేపడతారు. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులు జాయిన్ అయ్యే సమయంలో రూ.2 లక్షల బాండ్ రాసి ఇవ్వాలి. బాండ్ ప్రకారం అభ్యర్ధులు కనీసం మూడేళ్లు బ్యాంకుకు సేవలు అందించాలి. నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను https://bank.sbi/web/careers లేదా https://www.sbi.co.in/careers వెబ్సైట్లో చూడొచ్చు.
ముఖ్య సమాచారం:
అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత/ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా అర్హులు.
వయసు: 01.04.2020 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 04, 2020
ఫేజ్ 1 ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్: 2020 డిసెంబర్ 31, 2021 జనవరి 2,4,5
ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాల విడుదల: 2021 జనవరి మూడో వారం
మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ డౌన్లోడ్: 2021 జనవరి మూడో వారం
ఫేజ్ 2 ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్: 2021 జనవరి 29
మెయిన్ ఫలితాల విడుదల: 2021 ఫిబ్రవరి మూడోవారం లేదా నాలుగో వారం
వెబ్సైట్: https://www.sbi.co.in/web/careers
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com