10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లైకి ఆఖరు తేదీ..

భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, పెన్షన్స్ మంత్రిత్వ శాఖ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ విభాగానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎన్ఎస్సీ) పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 10వ తరగతి అర్హతతో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మార్చి 21 దరఖాస్తుకు ఆఖరు తేదీ. అభ్యర్ధులు పూర్తి వివరాలకు https://ssc.nic.in/ వెబ్సైట్లో చూడొచ్చు. గతంలో మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ (MTS) నోటిఫికేషన్ ద్వారా 9069 పోస్టుల్ని భర్తీ చేసింది. ఈసారి కూడా దాదాపు అంతే సంఖ్యలో ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది.
ముఖ్య సమాచారం..
ఖాళీలకు సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటిస్తారు.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ పదో తరగతి లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి.
వయసు: వివిధ విభాగాలను అనుసరించి 01.01.2021 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2) ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా..
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 05,2021,
దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 21, 2021.
ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: మార్చి 23, 2021.
ఫైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: మార్చి 29, 2021.
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (టైర్-1): 01.07.2021 నుంచి 20.07.2021 వరకు.
టైర్-2 పరీక్ష తేదీ (డిస్కిప్ట్రివ్ పేపర్): నవంబర్ 21, 2021.
వెబ్సైట్ : https://ssc.nic.in/
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com