మా రాష్ట్రంలో మతఘర్షణలు లేవు: సీఎం పినరై

కేరళలో కొన్నేళ్లుగా మత ఘర్షణలు లేవని ఆరాష్ట్ర సీఎం పినరయి విజయన్ తెలిపారు. ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ 2023 ప్రారంభోపన్యాసంలో గురువారం మాట్లాడిన ఆయన.. , "మన దేశంలో అత్యుత్తమ శాంతి భద్రతలుగల రాష్ట్రంగా కేరళ పేరుతెచ్చుకుంది. గత కొన్నేళ్లుగా తమ రాష్టంలో మత ఘర్షణలు చోటుచేసుకోలేవు " అని అన్నారు.
ఇటీవల దేశంలోనే తొలి ఇ-గవర్నెన్స్ రాష్ట్రంగా కేరళ అవతరించిందని, ఇది చారిత్రాత్మక మైలురాయని తెలిపారు. "ఇ-గవర్నెన్స్ ద్వారా, మేము పారదర్శకత, సమర్థత మరియు కలుపుకొని పోవడానికి కట్టుబడి ఉన్నాము" అని తెలిపారు. " ప్రజా సేవ విషయంలో నేరుగా ప్రజలకు న్యాయం జరిగేందుకు మేము సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాము. వీటిలో 900కంటే ఎక్కువ సేవలు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి" అని ఆయన చెప్పారు. మరో 2,000 ఉచిత పబ్లిక్ వై-ఫై హాట్స్పాట్లను ఏర్పాటు చేసే ప్రాజెక్ట్ పైప్లైన్లో ఉందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు సహా బహిరంగ ప్రదేశాల్లో 2,000 ఉచిత వై-ఫై హాట్స్పాట్లను ఏర్పాటు చేశామని, మరో 2,000 పైప్లైన్లో ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com