By - Vijayanand |2 Jun 2023 7:30 AM GMT
తెలంగాణదశాబ్ది వేడుకలపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. పోరాట యోధుడే పాలకుడై..సాధించిన తెలంగాణను..సగర్వంగా దేశంలోనే..సమున్నతంగా నిలిపిన వేళ దశాబ్ది వేడుకలను ఘనంగా జరుపుకుంటోందని ట్వీట్ చేశారు.
తెలంగాణ, నేడు దేశానికే ఆదర్శంగా నిలిచి దశాబ్ది వేడుకలు జరుపుకుంటోందని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం కేసీఆర్ సారథ్యంలో బంగారు తెలంగాణకు బాటలు పడి ఉద్యమ ఆకాంక్షలైన "నీళ్లు, నిధులు, నియామకాలు" నెరవేరి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ అనుభవంలోకి వచ్చాయని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com