Uttar Pradesh :పట్టపగలు డాక్టర్ ను కాల్చిచంపిన దుండగులు

Uttar Pradesh :పట్టపగలు డాక్టర్ ను కాల్చిచంపిన దుండగులు

ఓ డాక్టర్ ను గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఫజియాబాద్ లో శనివారం జరిగింది. మురాద్ నగర్ పోలీస్టేషన్ పరిధిలో అతను తన క్లినిక్ లో ఉండగా ఈ సంఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, గుర్తుతెలియని దుండగులు హాస్పిటల్ లోకి చొరబడి రౌండ్స్ కు వెళ్తున్న డాక్టర్ శంషాద్ (40)ను కాల్చి చంపారు. హాస్పిటల్ సిబ్బంది వెంటనే మరో హాస్పిటల్ కు తరలించగా.. అప్పటికే శంషాద్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

సమాచారం అందుకున్న రూరల్ డీసీపీ రవికుమార్, ఏసీపీ నిమిష్ పాటిల్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. డీసీపీ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బైక్ పై క్లినిక్ కు చేరుకున్న దుండగులు శంషాద్ పై కాల్పులు జరిపి పారిపోయారని చెప్పారు. దాడి చేసిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story