కిసాన్‌ సమ్మాన్‌ నిదిని విడుదల చేయనున్న పీఎం మోదీ

కిసాన్‌ సమ్మాన్‌ నిదిని విడుదల చేయనున్న పీఎం మోదీ

దేశ వ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది రైతులకు ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిది 13వ విడత కింద 16వేల800 కోట్ల సాయాన్ని ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. ఈ పథకంలో అర్హులైన రైతులకు ఏడాదిలో ఆరు వేల సాయం చొప్పున మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా కేంద్ర ప్రభుత్వం జమ చేస్తోంది. కర్ణాటకలోని బెళగావిలో లక్ష మందికి పైగా కిసాన్‌ సమ్మాన్‌ నిధి, జల్‌ జీవన్‌ మిషన్‌ లబ్ధిదారులతో నిర్వహించనున్న సభలో ప్రధాని 13వ విడత సాయాన్ని విడుదల చేస్తారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఈ పథకంలో 11 కోట్ల మందికి పైగా రైతులకు 2.25 లక్షల కోట్ల నిధులను పంపిణీ చేసినట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story