సామర్లకోటలో ప్రమాదం... గోడ కూలి ఇద్దరు మృతి

X
By - Vijayanand |19 April 2023 6:43 PM IST
కాకినాడ జిల్లా సామర్లకోట బలుసులపేటలో ప్రమాదం జరిగింది. గోడ కూలి ఇద్దరు మృతి చెందారు. పునర్నిర్మాణంలో ఉన్న చర్చ్ గోడ కూలింది. దీంతో శిథిలాల కింద చిక్కుకుపోయి అర్జున్రావు, నాగేశ్వరరావు, అబ్రహంలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్జున్రావు, నాగేశ్వరరావు మృతి చెందారు. ఘటనా స్థలాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పరిశీలించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com