Breaking News : ట్రాఫిక్ పోలీసులపైకి దూసుకెళ్లిన లారీ.. హోంగార్డు మృతి
By - Vijayanand |25 Jan 2023 10:26 AM GMT
హైదరాబాద్: వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులపైకి ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో హోంగార్డు మృతిచెందాడు. మేడ్చల్ మండల పరిధిలోని కండ్లకోయ జాతీయ రహదారిపై ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే హోం గార్డు ప్రాణంతీసిందని పోలీసులు తెలిపారు.
కండ్లకోయ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో.. కంటైనర్ను ఆపేందుకు వెళ్లిన ట్రాఫిక్ హోంగార్డుపైకి కంటైనర్ అతి వేగంతో దూసుకొచ్చింది. ప్రమాదంలో హోంగార్డు శ్రీనివాస్ లారీ చక్రాల కింద పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన ట్రాఫిక్ పోలీస్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com