అసోం మాజీ సీఎంకి కరోనా పాజిటివ్
By - Admin |26 Aug 2020 7:26 AM GMT
అసోం మాజీ సీఎం కరోనా బారిన పడ్డారు. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత తరుణ్ గొగోయ్ కి కరోనా సోకింది.
దేశంలో కరోనా స్వైర విహారం చేస్తోంది. ఇక అసోంలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. నిత్యం రాష్ర్టంలో పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ కరోనా మహమ్మారి సామన్యుల నుంచి రాజకీయ ప్రముఖుల వరకు ఎవరినీ వదలటం లేదు. తాజాగా అసోం మాజీ సీఎం కరోనా బారిన పడ్డారు. అసోం మాజీ సీఎం, కాంగ్రెస్ నేత తరుణ్ గొగోయ్ కి కరోనా సోకింది. ఈ విషయాన్ని తరుణ్ ట్వీట్ చేశాడు. 'నిన్న నాకు కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. గత కొన్ని రోజులలో నాతో కాంటాక్ట్ అయిన వారు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని' ఆయన ట్విట్టర్లో కోరారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com